నేడు నగరానికి ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని

- February 14, 2018 , by Maagulf
నేడు నగరానికి ఇరాన్ అధ్యక్షుడు  హసన్ రౌహాని

హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని నేడు హైదరాబాద్ కు రానున్నారు. హసన్ రౌహాని నగర పర్యటన నేపథ్యంలో పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మక్కా మసీదులో శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇరాన్ అధ్యక్షుడి పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇరాన్ కాన్సులేట్ జనరల్ సూచనల మేరకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హుస్సేనిఅలం ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com