ఇరాన్, భారత్ మధ్య 9 కీలక ఒప్పందాలు
- February 17, 2018
న్యూఢిల్లీ: భారత్, ఇరాన్ మధ్య ఇవాళ పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. చర్చల అనంతరం సుమారు తొమ్మిది అగ్రిమెంట్లపై సంతకాలు జరిగాయి. చాబహర్ పోర్ట్ వినియోగం, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం లాంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. రోహనీ, మోదీలు కలిసి సంయుక్తంగా పోస్టల్ స్టాంపులను కూడా రిలీజ్ చేశారు. రోహనీ రాక వల్ల రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని మోదీ అన్నారు. ప్రెసిడెంట్ రౌహనీ విజన్ను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇరు దేశాల మధ్య మైత్రి పెరిగిందని ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి