దుబాయ్ లో మరణించిన శ్రీదేవి

- February 24, 2018 , by Maagulf
దుబాయ్ లో మరణించిన శ్రీదేవి

దుబాయ్: ప్రముఖ నటి శ్రీదేవి తన బంధువుల పెళ్ళికి హాజరవ్వటానికై దుబాయ్ విచ్చేసారు. దుబాయ్ లోని 'ఎమిరేట్స్ టవర్స్' లో బస చేసిన శ్రీదేవి శనివారం రాత్రి 11గంటలకు ((భారత కాలమానం అర్ధరాత్రి 12.30 గంటలు) తన రూమ్ బాత్రూం లో స్పృహ తప్పి పడిపోయి ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 'రషీద్ హాస్పిటల్' కు తరలించారు. కాగా అప్పటికే శ్రీదేవి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్రీదేవి పార్థివ దేహాన్ని 'ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్' కు అందజేశారు. కాన్సల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ..దుబాయ్ పోలీసు వారితో సంప్రదించి, ఫార్మాలిటీస్ పూర్తి చేసి త్వరితగతిన శ్రీదేవి పార్థివ దేహాన్ని భారత్ కు పంపే సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com