నేడు స్వదేశానికి శ్రీదేవి పార్తీవదేహం
- February 25, 2018
ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి దుబాయ్లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్లో హఠాన్మరణం చెందిన సంగతి తెల్సిందే. శనివారం రాత్రి 11 గంటలకు ఆమె మరణించగా, ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆసుపత్రి వెలుపల ఆమె మరణించిన దరిమిలా, డెత్ సర్టిఫికెట్ తదితర విషయాల కోసంగాను ఆమె మృతదేహం తరలింపు ఏర్పాట్లు కొంతమేర ఆలస్యమవుతున్నాయి. వాష్రూమ్లో ఆమె హఠాత్తుగా సంభవించిన గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమికంగా తెలియవస్తోంది. పూర్తి వివరాలు డెత్ రిపోర్ట్లో వెల్లడి కానున్నాయి. ఇండియన్ కాన్సులేట్, శ్రీదేవి పార్తీవ దేహాన్ని ఇండియాకి తరలించే ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కాస్సేపట్లో ఆమె మృతదేహం ఇండియాకి ప్రత్యేక విమానంలో బయల్దేరనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి