నేడు స్వదేశానికి శ్రీదేవి పార్తీవదేహం

- February 25, 2018 , by Maagulf
నేడు స్వదేశానికి శ్రీదేవి పార్తీవదేహం

ప్రముఖ బాలీవుడ్‌ నటి శ్రీదేవి దుబాయ్‌లోని జుమైరా ఎమిరేట్స్‌ టవర్స్‌లో హఠాన్మరణం చెందిన సంగతి తెల్సిందే. శనివారం రాత్రి 11 గంటలకు ఆమె మరణించగా, ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆసుపత్రి వెలుపల ఆమె మరణించిన దరిమిలా, డెత్‌ సర్టిఫికెట్‌ తదితర విషయాల కోసంగాను ఆమె మృతదేహం తరలింపు ఏర్పాట్లు కొంతమేర ఆలస్యమవుతున్నాయి. వాష్‌రూమ్‌లో ఆమె హఠాత్తుగా సంభవించిన గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమికంగా తెలియవస్తోంది. పూర్తి వివరాలు డెత్‌ రిపోర్ట్‌లో వెల్లడి కానున్నాయి. ఇండియన్‌ కాన్సులేట్‌, శ్రీదేవి పార్తీవ దేహాన్ని ఇండియాకి తరలించే ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కాస్సేపట్లో ఆమె మృతదేహం ఇండియాకి ప్రత్యేక విమానంలో బయల్దేరనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com