షకీలా.. 'శీలవతి' టీజర్ విడుదల
- March 07, 2018
సెన్సేషనల్ స్టార్ షకీలా 250వ చిత్రంగా 'జి' స్టూడియోస్ సమర్పణలో, రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శీలవతి'. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర యూనిట్. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ''నా 250వ చిత్రంలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. నెక్స్ట్ సీన్ ఏంటనేది.. అందులో నటించే నాకు కూడా తెలియకుండా స్క్రీన్ ప్లే ను ప్లాన్ చేసాడు దర్శకుడు. నిర్మాతలిద్దరూ సినిమా కోసం ఏం కావాలన్నా అందించారు. మే లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
గీతాంజలి (ఫ్రూటీ) మాట్లాడుతూ.. ''షకీలా గారితో ఇది నా రెండవ చిత్రం. యంగ్ టీమ్ కలసి పని చేసిన సినిమా కనుక చాలా ఫాస్ట్గా ఇంట్రెస్టింగ్గా షూటింగ్ పూర్తి చేశాం. ఫైనల్గా సినిమా చాలా బాగా వచ్చింది. మీరంతా సినిమా చూసి ఆదరించాలని కోరుతున్నా'' అన్నారు.
నిర్మాత గణేష్ మాట్లాడుతూ.. ''మా బ్యానర్లో వస్తున్న మొదటి సినిమా ఇది. షూటింగ్ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే లో విడుదల చేయనున్నాము'' అన్నారు.
మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. ''ఇంతకు ముందు రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినా.. సంతృప్తి నిచ్చిన సినిమా మాత్రం 'శీలవతి'. నాకు, షకీలా గారికి మధ్య ఒక నిర్మాత, ఆర్టిస్ట్లా మొదలైన జర్నీ.. అక్కా.. తమ్ముడు అనుకునేంతగా బంధం ఏర్పడింది. తను చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను'' అన్నారు.
దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ.. ''కెమెరామెన్ బెస్ట్ వర్క్ను ఇచ్చాడు. నిర్మాతలు ఇద్దరూ చాలా మంచి సపోర్ట్ను అందించారు. ఈ సినిమా చూశాక.. ఇంతకు ముందు షకీలా వేరు ఈ సినిమా తరువాత షకీలా వేరు అని మీరే అంటారు. ఈ సినిమాతో మంచి పేరొస్తుంది తనకు. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ మరియు హార్రర్ కామెడీ జోనర్. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి