300 మందికి శిక్షలు విధించిన ఇరాక్‌

- April 18, 2018 , by Maagulf
300 మందికి శిక్షలు విధించిన ఇరాక్‌

ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ కార్యకలాపాల అడ్డుకట్టకు ఆ దేశ ప్రభుత్వం పూనుకుంది. ఇస్లామిక్‌ స్టేట్‌కు సహకరించిన వారికి ఇరాక్‌ ప్రభుత్వం కఠిన శిక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో 300మందికి శిక్షలు విధించింది. వారిలో విదేశీయులు, మహిళలు కూడా ఉన్నారు. ఉగ్రవాద సంస్థతో పనిచేస్తున్నారన్న ఆరోపణలపై కొంతమందిని మోసుల్‌, దేశ రాజధాని నగరం బాగ్దాద్‌లోని న్యాయస్థానాల్లో విచారణ నిర్వహించినట్లు న్యాయనిపుణులు వెల్లడించారు. వారికి శిక్షలు విధించినట్లు తెలిపారు. కాగా, అనుమానితులను శిక్షిస్తున్న నేపథ్యంలో ఇరాక్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇలా శిక్షలు విధించడం వల్ల అమాయకులు చనిపోవడంతో పాటు బాధితులకు సరైన న్యాయం అందదని ఆ సంస్థ అభిప్రాయపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com