ఆ అజ్ఞాతవాసి పేరు బయట పెట్టిన పవన్ కళ్యాన్!
- April 21, 2018
ఈ విషయాన్ని తాను కూడా లీగల్ గానే వెళ్తానని..చెబుతున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్. కాగా, నిన్న ఫిలిమ్ ఛాంబర్ లో మూడు టివి ఛానల్స్ పై నిప్పులు చెరిగిన పవన్ మరికొంత మంది పేర్లు కూడా బయట పెడతానని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోపణలు చేసిన శ్రీని రాజు(శ్రీసిటీ ఓనర్) అతడికి లీగల్ నోటీసులను పంపారు. దానికి సంబంధించిన కాపీలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పవన్.. మీ బెదిరింపులకు బెదిరిపోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా..'' శ్రీని రాజు మీరు పంపిన నోటీసులు నన్నేం మార్చలేవు.
రియల్ అఙ్ఞాతవాసి రవి ప్రకాశ్ చొరవతో మా తల్లిపై జరిగిన అవమానాన్ని మీరు పదే పదే చూపించారు. మీ సీఈవో, అలాగే అతడిని ప్రభావితం చేసిన రాజకీయనాయకులు అందరిపై న్యాయపోరాటం చేస్తా. గుడ్లుక్ శ్రీని'' అని కామెంట్ పెట్టారు.. శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. శ్రీనిరాజు తనకు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి