ఆ అజ్ఞాతవాసి పేరు బయట పెట్టిన పవన్ కళ్యాన్!
- April 21, 2018ఈ విషయాన్ని తాను కూడా లీగల్ గానే వెళ్తానని..చెబుతున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్. కాగా, నిన్న ఫిలిమ్ ఛాంబర్ లో మూడు టివి ఛానల్స్ పై నిప్పులు చెరిగిన పవన్ మరికొంత మంది పేర్లు కూడా బయట పెడతానని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోపణలు చేసిన శ్రీని రాజు(శ్రీసిటీ ఓనర్) అతడికి లీగల్ నోటీసులను పంపారు. దానికి సంబంధించిన కాపీలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పవన్.. మీ బెదిరింపులకు బెదిరిపోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా..'' శ్రీని రాజు మీరు పంపిన నోటీసులు నన్నేం మార్చలేవు.
రియల్ అఙ్ఞాతవాసి రవి ప్రకాశ్ చొరవతో మా తల్లిపై జరిగిన అవమానాన్ని మీరు పదే పదే చూపించారు. మీ సీఈవో, అలాగే అతడిని ప్రభావితం చేసిన రాజకీయనాయకులు అందరిపై న్యాయపోరాటం చేస్తా. గుడ్లుక్ శ్రీని'' అని కామెంట్ పెట్టారు.. శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. శ్రీనిరాజు తనకు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు