నేడే 'నా పేరు సూర్య' ఆడియో లాంచ్
April 21, 2018
అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'నా పేరు సూర్య'. 'నా ఇల్లు ఇండియా' అనేది టాగ్లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్పై వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మిలిటరీ ఆఫీసర్గా దర్శనమీయనున్నాడు. బన్నీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్లుక్, టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి.
కాగా నేడు (ఆదివారం) ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం వేదిక కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ వేడుకలో అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్తో పాటు చిత్ర బృందం అంతా పాల్గొనబోతోంది. ఈ సినిమా మే 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.