నిరుద్యోగులకు ఈ 30న జాబ్మేళా
- April 28, 2018
హైదరాబాద్: సామ రంగారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న నగరంలోని వనస్థలిపురం పనామా చౌరస్తాలో గల బొమ్మిడి లలితా గార్డెన్స్లో జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ సామ రంగారెడ్డి తెలిపారు. ఏడు, పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బీఫార్మా, ఎంఫార్మా, ఏఎన్ఎం, జీఎన్ఎం, ఎంఎల్టీ, బీపీటీ చేసిన వారితో పాటు చదువులేని వారికి సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతాయని పేర్కొన్నారు. జాబ్మేళాలో ఐసీఐసీఐ బ్యాంకు, ఏఆర్కే టెక్నాలజీస్, సన్లైన్ బిజినెస్ సొల్యూషన్స్, ధ్రువ్ కన్సల్టింగ్, క్యాంపస్ మార్గ్, హెడీబీ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, శుభగృహ, ఆవాస కన్సల్టింగ్, టెక్ మహీంద్ర, కొటక్ మహీంద్ర, కార్వీఫోర్డ్ తదితర సంస్థలు పాల్గొని అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..