ఇరాన్‌:టెహ్రాన్‌పై దాడి కేసులో 8 మంది ఉగ్రవాదులకు ఉరి

- July 07, 2018 , by Maagulf
ఇరాన్‌:టెహ్రాన్‌పై దాడి కేసులో 8 మంది ఉగ్రవాదులకు ఉరి

టెహ్రాన్‌ : ఇరాన్‌ పార్లమెంట్‌ పైన, ఇరాన్‌ మత నాయకుడు రోహుల్లా ఖోమేనీ మసోలియంóపైన 2017లో దాడి జరిపిన ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) గ్రూపునకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులను శనివారం ఉరి తీసినట్లు ఇరాన్‌ తెలిపింది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను ఉరితీసిన విషయాన్ని అధికారిక మిజాన్‌ వార్త సంస్థతో పాటు ఇతర వార్తా సంస్ధలు కూడా ధ్రువీకరించాయి. కాని ఎప్పుడు ఉరితీశారన్న విషయాన్ని పేర్కొనలేదు. మరణ శిక్షలు విధించడంలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఇరాన్‌ ఉన్నప్పటికీ ఈ విధంగా సామూహికంగా ఉరితీసిన సంఘటనలు అరుదు. అంతకుముందు 2007లో ఒకసారి సామూహిక ఉరిశిక్షలను ఇరాన్‌ అమలు చేసింది. మషాద్‌లో అత్యాచారానికి పాల్పడిన ఏడుగురిని ఒకేసారి ఉరితీసింది. ఇస్లామిక్‌ స్టేట్‌ పార్లమెంట్‌పై జరిపిన దాడిలో 18 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి మరో 12 మందిపై విచారణ జరుగుతున్నది.
పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com