అక్టోబర్ 5న విడుదల కానున్న"బేవర్స్” సినిమా
- September 19, 2018
“ఆనలుగురు”, “మీ శ్రేయాభిలాషి” లాంటి గర్వించదగ్గ ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం బేవర్స్. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాసం సమర్పణలో ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై నిర్మాతలు పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా…
నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మొదట్లో ఈ చిత్రానికి బేవర్స్ అనే టైటిల్ ఏంటి అనుకున్నాను. ఇదే డౌటు ఆడియెన్స్ కి కూడా వస్తుంది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఈ చిత్రం చూస్తే అర్దమవుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు… పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తన మనసు, ప్రాణం పెట్టి రాసిన.. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా.. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా.. నాఇంట నువ్వుంటే మాయమ్మే వుందంటూ మురిసానమ్మా..ఏ జన్మలో పాపమో నేను చేశానో ఈ శిక్షవేశావమ్మా.. పోద్దున్నే పోద్దల్లే నువు నాకు ఎదురోస్తే అదృష్టం నాదనుకున్నా.. సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లొ నా దీపం నీవనుకున్నా.. లోకంలొ నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో వున్నానమ్మా..చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా నీలాగే తోచేనమ్మా.. అంటూ సాగే అద్బుతమైన సాంగ్ చాలా మంచి హిట్ గా నిలిచింది. హీరో, హీరోయిన్ చాలా బాగా చేశారు. ఈ సినిమా నా కెరీర్ లో మరో మంచి చిత్రం గా నిలుస్తుంది. అక్టోబర్ 5న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అని అన్నారు.
డైరెక్టర్ రమేష్ చెప్పాలా మాట్లాడుతూ… మీ శ్రేయోభిలాషి చిత్రానికి రచయిత గా ఎంత గా తృప్తి చెందానో బేవర్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందాను. రాజేంద్రప్రసాద్ గారు ఈ పాత్ర ఇప్పటివరకు చేయకపోవడం నా అదృష్టం. ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని అన్నారు.
నిర్మాతలు పొన్నాల చందు, Dr.M.s.murthy, ఎమ్. అరవింద్ లు మాట్లాడుతూ.. డా. రాజేంద్రప్రసాద్ గారు నటించిన అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి ఒకటి. అలాంటి చిత్రానికి రైటర్ గా పనిచేసిన రమేష్ చెప్పాలా దర్శకుడిగా రాజేంద్రప్రసాద్ గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బేవర్స్. మా బ్యానర్ SSK ENTERTAINMENTS పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాము. విడుదల చేసిన సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సంజోష్, హర్షిత లు హీరో హీరోయిన్స్ గా చాలా బాగా నటించారు. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము అని అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి