ఢిల్లీ: కరోనా 'లాక్‌డౌన్‌' నేపథ్యంలో ముందుగానే 3 నెలల పింఛను

- March 28, 2020 , by Maagulf
ఢిల్లీ: కరోనా 'లాక్‌డౌన్‌' నేపథ్యంలో ముందుగానే 3 నెలల పింఛను

ఢిల్లీ: కరోనా 'లాక్‌డౌన్‌' నేపథ్యంలో వితంతువులు, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు 3 నెలల పింఛను ముందుగానే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ సామాజిక చేయూత పథకం(ఎన్‌ఎస్‌ఏపీ) కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దేశంలోని సుమారు 2.98 కోట్ల మంది పేద సీనియర్‌ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ పింఛను పంపిణీ చేస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏప్రిల్‌ మొదటి వారంలో మూడు నెలల పింఛను మొత్తాన్ని ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఎన్‌ఎస్‌ఏపీ కింద 60-79 ఏళ్ల సీనియర్‌ సిటిజన్లకు నెలకు రూ.200 చొప్పున, 80 ఆపైన వయస్సు వారికి రూ.500 చొప్పున అందజేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com