యూఏఈ : జాత్యాహంకార ప్రసంగం చేసిన మీడియా వ్యక్తికి రిమాండ్
- April 16, 2020
యూఏఈ:ఓ వర్గాన్ని కించపరుస్తూ జాత్యాహంకార ప్రసంగం చేసిన వ్యక్తికి రిమాండ్ కు తరలించారు. యూఏఈకి చెందిన ఓ మీడియాలో పని చేస్తున్న టీఎం అనే వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోపై ఫిర్యాదులు రావటంతో యూఏఈ ఫెడరల్ కోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు తన ప్రసంగంలో జాత్యాహంకారం ప్రస్పుటించటమే కాకుండా ఓ వర్గాన్ని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది యూఏఈ ప్రధామిక సూత్రమైన సమానత్వ భావనకు విరుద్ధంగా ఉందని కోర్టు అభిప్రాపడింది. నిందితుడిపై ఉన్న ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది..న్యాయపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికార ప్రతినిధి తెలిపారు. సోషల్ మీడియా వేదికగ గానీ, మరే ఇతర మాధ్యమంలోనైనా సరే జాత్యాహంకార వ్యాఖ్యలు చేసి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







