ఆదివారం 6,463 మంది మరణించారు:WHO

- April 20, 2020 , by Maagulf
ఆదివారం 6,463 మంది మరణించారు:WHO

ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 81 వేల 153 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించబడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. అలాగే 6,463 మంది మరణించారు. శనివారం కంటే ఆదివారం తక్కువ కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజులతో పోలిస్తే నాలుగు వేల తక్కువ కేసులు, 247 తక్కువ మరణాలు నమోదయ్యాయి. WHO ప్రకారం, ఐరోపాలో 1.1 మిలియన్లకు పైగా ప్రజలు వైరస్ సంక్రమణ భారిన పడ్డారు.

అదే సమయంలో, ఇక్కడ మరణాల సంఖ్య కూడా లక్షకు మించిపోయింది. కాగా WHO చీఫ్ టెడ్రోస్ అధోనమ్ గెబ్రేసియస్ జి 20 ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కరోనాతో పోరాడుతున్న దేశాలకు సహాయం చేయాలని ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com