అబుధాబి:ఎమిరాతీలకు, ప్రవాసీయులకు ఉచిత కరోనా టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం
- May 13, 2020
అబుధాబి:కరోనా వైరస్ కట్టడికి అబుధాబి అధికారులు వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత ముమ్మరం చేయనున్నారు. అబుధాబిలోని ఎమిరాతీలతో పాటు వారి ఇళ్లలో పని చేసే కార్మికులకు ఉచితంగా కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారులను ఆదేశించారు. దీంతో వచ్చే వారం నుంచి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రవాసీయులకు కూడా ఫ్రీ టెస్టులు చేయనున్నారు. అలాగే గర్భిణిలకు, 50 ఏళ్లు పైబడిన వారికి, కరోనా పాజిటివ్ వ్యక్తులతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే...వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేసిన యూఏఈ ఇప్పటివరకు 13 లక్షల మందికి టెస్టులు నిర్వహించింది. అంటే ప్రతి పది మందిలో ఒక్కరికి పరీక్షలు చేసింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







