ఈ నెల 29 వరకు మస్కట్ లాక్ డౌన్

- May 14, 2020 , by Maagulf
ఈ నెల 29 వరకు మస్కట్ లాక్ డౌన్

ముస్కట్:సామాజిక దూరం సరిగా పాటించక, సమూహం గా ప్రజలు తిరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈనెల 29వ తేదీ వరకు మస్కట్ తదితర ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ అహ్మద్ అల్ సయ్యేది ప్రకటించారు. గురువారం నిర్వహించిన కోవిద్-19 సుప్రీం కమిటీ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ-మీడియా సమావేశంలో ఈవిషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత ముత్రహ్ ప్రాంతంలో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. విలయత్ ప్రాంతంలో పెరుగుతున్నాయన్నారు.

పరిస్థితులు ఇలాగే కొనసాగి, సామాజిక దూరం పాటించకుండా.. సమూహాలుగా తిరిగితే కర్ఫ్యూ విధించే ప్రతిపాదన సుప్రీం కమిటీ ముందు ఉంచుతామని హెచ్చరించారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com