ఏపీ: 2205కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- May 16, 2020
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో గుంటూరు 9, చిత్తూరు 8, కడప 1, కృష్ణా 7, కర్నూలు 9,నెల్లూరు 9, విశాఖపట్నం 4, పశ్చిమ గోదావరి 1 ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో 9,628 మంది సాంపిల్స్ ని పరీక్షించగా 48 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. గత 24 గంటల్లో కొత్తగా 101 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చారయ్యారు. అందులో కర్నూలు నుంచి 47, అనంతపురం 37, కృష్ణా 5, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం నుంచి ముగ్గురు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన కేసుల సంఖ్య 1353కు చేరుకుంది. కరోనాతో ఇవాళ ఒకరు మరణించగా మరణాల సంఖ్య 49కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 803గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







