కరోనాపై పోరాటం: వైరస్ వ్యాప్తికి కారణమైన వ్యక్తులకు ఐదేళ్ల జైలుశిక్ష..లక్ష దిర్హామ్ జరిమానా

- June 07, 2020 , by Maagulf
కరోనాపై పోరాటం: వైరస్ వ్యాప్తికి కారణమైన వ్యక్తులకు ఐదేళ్ల జైలుశిక్ష..లక్ష దిర్హామ్ జరిమానా

యూఏఈ:కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా యూఏఈ ప్రభుత్వం గత చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది. ఎవరైనా వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగాగానీ, నిర్లక్ష్యంతోగానీ కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైతే..వారికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష దిర్హామ్ ల వరకు జరిమానా విధించనుంది. యూఏఈ చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించే హక్కు ఉంది. ఆ హక్కుకు భంగం కలిగించేలా ఇతరులు ఉద్దశ్యపూర్వకంగా వ్యాధులను వ్యాప్తి చెందించటం నేరం. ఇందులో భాగంగానే గత ఆరేళ్ల క్రితమే యూఏఈ ప్రభుత్వం అంటువ్యాధుల నివారణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కావాలని అంటువ్యాధులను వ్యాప్తి చెందేలా చేసిన వారికి 50 వేల నుంచి లక్ష దిర్హామ్ ల వరకు జరిమానా విధించొచ్చు. అలాగే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ ఈ నేరం మళ్లీ చేస్తే శిక్ష రెట్టింపు అవుతోంది. ఇక అంటువ్యాధి బారిన పడి సదరు వ్యక్తి చనిపోతే..వ్యాధి వ్యాప్తికి కారణమైన వ్యక్తికి మరో మూడేళ్లు అదనంగా జైలు శిక్ష విధిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com