గల్ఫ్ నుండి తెలుగు రాష్ట్రాలకు మరిన్ని విమానాలు నడపాలి - గల్ఫ్ జనసేన విన్నపం
- June 07, 2020
గల్ఫ్: 'గల్ఫ్ సేన-జనసేన' ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలు అయిన యూఏఈ, ఒమాన్, కువైట్, కతర్, బహ్రెయిన్, సౌదీఅరేబియా నుంచి ముఖ్య జనసేన నాయకులు, పార్టీ పెద్ద అయిన నాదెండ్ల మనోహర్ తో జూమ్ యాప్ ద్వారా ఆత్మీయ సమావేశము అయ్యారు. ఈ సమావేశంలో గల్ఫ్ దేశాల నుండి సుమారు 200 మంది జనసైనికులు పాల్గొని వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుత కరోనా సమయములో వివిధ ప్రాంతాల్లో జనసైనికులు చేస్తున్న సేవలు అలాగే గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రజలకు ఏ విధముగా జనసేన సహాయసహకారాలు అందిస్తుంది అన్న అంశముపై నాదెండ్ల మనోహర్ జనసైనికులును అడిగి తెలుసుకుని తగు సూచనలు, సలహాలు అందజేశారు.

సమావేశంలో చర్చించిన అంశాలు:
* కరోనా సమయంలో ముఖ్యముగా తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ విమానసర్వీస్ లు నడిపి మరింత మందికి సదుపాయము అందేటట్టు చూడాలి.
* స్వదేశానికి వచ్చిన గల్ఫ్ వాసులను వివక్ష చూపకుండా ప్రేమతో మెలగాలి.
* స్వదేశానికి వచ్చిన గల్ఫ్ వాసులను క్వారంటైన్ పేరుతో డబ్బులు వసులు చేయడం తగదు.
* గల్ఫ్ ప్రాంత తెలుగు కార్మికులకు ఇన్సూరెన్స్ పాలసీ సులభతరం చేసి అందరూ లాభపడేటట్టు ఆలోచన చేయాలి.
తెలిపిన అన్ని అంశాలు సానుకూలంగా విన్న మనోహర్, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియచేస్తానని చెపుతూ, త్యరలో 'గల్ఫ్ సేన-జనసేన' ను కలుపుతూ ఓ కమిటీ వేసి దానిని పార్టీకు అనుసంధానపరుస్తాము అని హామీ ఇచ్చారు.

సమావేశంలో పాల్గొన్నవారు:
దుబాయ్ నుంచి కేసరి త్రిమూర్తులు కోఆర్డినేట్ చేయగా, అమలాపురం పార్లమెంటరీ జనసేన నాయుకులు శెట్టిబత్తుల రాజబాబు కావాల్సిన సహాయసహకారాలు పార్టీ ఆఫీస్ నుంచి ఇవ్వడము జరిగింది. ఈ సుమావేశములో జనసేన నాయకులు రామదాసు చందాక (ఒమాన్-మస్కట్), మురళీకృష్ణ, వీరబాబు, దొర (కతర్ -దోహా), బాలాజీ (కువైట్), రాయుడు (బహ్రెయిన్), భాస్కర్ (రియాద్-సౌదీ), జానుబాబు (ఫుజైరా-యూఏఈ) తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







