ఏపీలో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు..

- June 12, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 141 కరోనా  పాజిటివ్ కేసులు..

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో  కొత్తగా మరో 141  కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 11,775 నమూనాలను పరీక్షించారు.దీంతో మరోసారి వందకు పైగా కేసులొచ్చాయి. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు మొత్తం 4402 కు చేరింది.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక కొత్తగా వివిధ ప్రాంతాల్లో 59 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2599 కి చేరింది. కోవిడ్ భారిన పడి ఇప్పటివరకూ 80 మంది మనరాణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1723గా ఉంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com