ఏపీలో కొత్తగా 1608 కరోనా పాజిటివ్ కేసులు

- July 10, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 1608 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1576 మందికి కరోనా సోకింది. మిగతా 32 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,194 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 11,936 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 15 కరోనా మరణాలు సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 292కి చేరింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com