సౌదీ అరేబియా:పబ్లిక్ ప్రాంతాల్లో షిషా, బార్బెక్యూపై నిషేధం
- July 11, 2020
రియాద్:పబ్లిక్ ప్రాంతాల్లో బార్బెక్యూ(మాంసాన్ని మంటపై కాల్చటం), షిషా నిర్వహణను సౌదీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి ఎవరైన పార్కులు, గ్రౌండ్స్ లాంటి పబ్లిక్ ప్రాంతాల్లో బార్బెక్యూ కోసం మంట పెట్టినా, షిషా(హుక్కా) నిర్వహించినా స్పాట్ లోనే ఫైన్ వేస్తామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి తొలిసారిగా 100 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తామని, రెండో సారి కూడా నిషేధాన్ని ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానా అంటే 200 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తామని సౌదీ పురపాలక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బార్బెక్యూ కోసం మంట వెలగించటం ద్వారా నిర్వాహకులతో పాటు ప్రజలకు హాని పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







