సైబరాబాద్:పోలీసు కుటుంబాలతో సీపీ వీసీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్
- July 11, 2020
సైబరాబాద్:కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసు కుటుంబ సభ్యులు సమాజహితం కోసం మరింత విశ్వాసంతో, నిర్మాణాత్మకంగా ఆలోచించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 500 మంది పోలీసు కుటుంబ సభ్యులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ మానసికంగా బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా పోలీసుల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉప్పు నీరు, గోరు వెచ్చని తాగడం, తాజా ఆహారాన్ని తీసుకోవడం, విటమిన్ టాబ్లెట్లు తీసుకోవాలని సూచించారు. ఏమైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్లు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలను అనుసరించాలని సీపీ తెలిపారు.


తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







