బహ్రెయిన్:వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై కేసు
- August 16, 2020
మనామా:మనామా సమీపంలోని జుఫెయిర్ పట్టణంలో ఓ మహిళ వినాయక విగ్రహాలను ధ్వంసం చేసింది.సూపర్ మార్కెట్లో అమ్మకానికి పెట్టిన ఈ విగ్రహాలను ఆమె ఒక్కొక్కటిగా తీసి,నేలకేసి కొట్టి, ముక్కలు చేసింది.ఆమె చేస్తున్న అకృత్యాన్ని మరొక మహిళ వీడియో తీసింది.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
54 ఏళ్ళ వయసుగల ఆ మహిళ వినాయక విగ్రహాలను ధ్వంసం చేసింది.ఆ సూపర్ మార్కెట్ వర్కర్ను ఉద్దేశించి ఇస్లామిక్ దేశంలో ఇలాంటివి చెల్లవంటూ మండిపడింది.క్యాపిటల్ గవర్నరేట్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రకారం, వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.మతపరమైన మనోభావాలను అగౌరవపరచినందుకు, ఓ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు.
ఆమెపై కేసు పెట్టిన విషయాన్ని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కూడా ధ్రువీకరించింది. జుఫెయిర్లోని సూపర్ మార్కెట్లో విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై కేసు నమోదు చేసినట్లు ఓ ట్వీట్లో తెలిపింది.

తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







