ఫిషింగ్‌ స్కామర్స్‌ ముఠా గుట్టు రట్టు చేసిన స్పెషల్‌ స్క్వాడ్‌

- August 26, 2020 , by Maagulf
ఫిషింగ్‌ స్కామర్స్‌ ముఠా గుట్టు రట్టు చేసిన స్పెషల్‌ స్క్వాడ్‌

దోహా:ఎస్‌ఎంఎస్‌ల ద్వారా బ్యాంకింగ్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంబాటింగ్‌ ఎకనమిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ క్రైవ్స్‌ు ఉక్కుపాదం మోపింది. జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌కి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంబాటింగ్‌ ఎకనమిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ క్రైవ్స్‌ు, ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్కామర్స్‌ భరతం పట్టింది. ‘అన్‌ కవరింగ్‌ మాస్క్‌’ పేరుతో ఆపరేషన్‌ చేపట్టి, డజన్ల మంది మోసగాళ్ళ ఆటకట్టించింది. నిందితులు పెద్ద సంఖ్యలో బ్యాంక్‌ అకౌంట్ల నుంచి డబ్బుని దోచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం సుమారుగా 10 మిలియన్‌ ఖతారీ రియాల్స్‌ వుంటుందని అధికారులు వివరించారు. ఈ నేరాలకు ఉపయోగించిన మొబైల్‌ నెంబర్స్‌ని ట్రాక్‌ చేసి నిందితుల్ని అధికారులు పట్టుకోగలిగారు. ఎస్‌ఎంఎస్‌ పేరుతో జనాల్ని మోసగించడం, వారి నుంచి ఓటీపీ తదితర వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బు కొల్లగొట్టడం నిందితులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com