కోవిడ్ మరణాలపై అసత్య ప్రచారం..యూఏఈలో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- August 26, 2020
యూఏఈ: కరోనా మహమ్మారికి సంబంధించి ప్రజలను భయబ్రాంతులు చేసేలా ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా సహించేది లేదని యూఏఈ హెచ్చరించింది. కోవిడ్ మరణాలకు సంబంధించి యూఏఈలోని ఓ ఛానెల్ ప్రసారమైన వార్తపై యూఏఈ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోహాలు సృష్టించేలా వార్త కథనాలను ప్రసారం చేసిన సదరు ఛానెల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కోవిడ్ 19 వల్లే ఓ కుటుంబం చనిపోయినట్లు ప్రసారమైన వార్త పూర్తి నిరాధారణమైనది, అసత్యాలతో కట్టుకథలను ప్రసారం చేశారన్నది ప్రాసిక్యూషన్ వాదన. అసత్య ప్రచారం చేసిన వార్త కథనం వెనక అసలు నిజానిజాలు ఎంటో, కథనాల వెనక ఎవరెవరు ఉన్నారో వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోందని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోవిడ్ 19కి సంబంధించి ఏ రూపంలో అసత్య ప్రచారం జరిగినా అందుకు బాధ్యులైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







