ఏ.పిలో 10,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- August 26, 2020 , by Maagulf
ఏ.పిలో 10,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభిస్తోంది.గడిచిన 24 గంటల్లో 10,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,473 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, మొత్తం 2,86,720 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 81 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 34,18,690 మందికి కరోనా పరీక్షలు చేశారు. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com