ఏ.పిలో కొత్తగా 8,835 కరోనా పాజిటివ్ కేసులు

- September 16, 2020 , by Maagulf
ఏ.పిలో కొత్తగా 8,835 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏ.పిలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,835 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలోనే  కరోనాతో మరో 64 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,92,760కు చేరింది. ప్రస్తుతం  90,279 యాక్టివ్‌ కేసులున్నాయి.  ఇప్పటి వరకు 4,97,376 మంది కోలుకున్నారు. ఏపీలో  కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య  5105కు పెరిగింది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com