తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా పాజిటివ్ కేసులు
- September 18, 2020
హైదరాబాద్:తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 50 వేల 634 పరీక్షలు నిర్వహించగా... 2 వేల 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు ఉన్న కేసుల సంఖ్య ఒక లక్షా 67 వేల 46కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజులో కరోనా 11 మంది చనిపోగా... రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు... ఒక వెయ్యి 16కి చేరాయి. కరోనా నుంచి నిన్న ఒక్క రోజులో 18 వందల 2 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య ఒక లక్షా 35 వేల 357కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30 వేల 673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 24 వేల 81 మంది హోం ఐలోలేషన్లో ఉన్నారని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 23 లక్షల 79 వేల 950 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా GHMC పరిధిలో 314, రంగారెడ్డిలో 174, మేడ్చల్లో 144 కొత్త కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







