పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కాబినెట్ ఆమోదం

- February 24, 2021 , by Maagulf
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కాబినెట్ ఆమోదం

పుదుచ్చేరి:పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.విశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేపట్టక ముందే ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి వాకౌట్ చేశారు.నారాయణస్వామి తన రాజీనామాను పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అందించారు.అటు ప్రతిపక్ష కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి పాలనను సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది.లెఫ్ట్ నెంట్ గవర్నర్ లేఖపై కేంద్రం కేబినెట్ లో చర్చించి ఆమోదించారు. కేంద్రం ఆమోదంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమలు కాబోతున్నది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com