శని, ఆదివారాల్లో పూరి జగన్నాథ్ ఆలయం మూసివేత..
- April 17, 2021
ఒడిశా: భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది, దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ కోసం చర్యలు మొదలు పెట్టాయి.అందులో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుంటే.. మరొకొన్ని రాష్ట్రాలు పార్కులు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.తాజాగా ఒడిశా ప్రభుత్వం కూడా కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరగడం దృష్ట్యా పూరిలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయం వారాంతాల్లో మూసివేయబడుతుందని..జగన్నాథుడి దర్శనం భక్తులకు వారాంతాల్లో ఉండదని జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం తెలిపింది.ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 19, 2021 నుండి అమల్లోకి రానున్నాయి.
కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి.. ఆలయ ప్రాంగణం పరిశుభ్రం చేయడానికి ఇక నుంచి ప్రతి శని, ఆదివారాల్లో పూరి జగన్నాథ్ ఆలయం మూసివేయబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.ఇక నుంచి శని, ఆదివారాల్లో పబ్లిక్ దర్శనం ఉందన్నారు.పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులందరూ ఆలయ సందర్శనకు 96 గంటలోపు చేసిన కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ (RT-PCR) ను తీసుకుని రావాలని.. ఉత్తర్వులు జారీ చేసింది.
ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యక్తులపై ఆంక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి” అని తెలిపింది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఒడిశాలో ప్రస్తుతం 13,837 కరోనా పా
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







