కడప జిల్లాలో పేలుడు పై స్పందించిన చంద్రబాబు
- May 08, 2021
హైదరాబాద్: కడప జిల్లాలో పేలుడు ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.ఈ ఘటన పైన ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా పేలుడు పదార్థాల విస్ఫోటనంతో 8 మంది కూలీలు మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ఈ బ్లాస్టింగ్ సంభవించింది.ముగ్గు రాయి తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి.ఈ ప్రమాదంలో ఎనమిది మంది కూలీలు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









