బహ్రెయిన్: 40 ఏళ్లు మించిన వారికి బూస్టర్ షాట్..80% లక్ష్యం
- July 31, 2021
బహ్రెయిన్: కోవిడ్ వేరియంట్ల నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు వీలైనంత ఎక్కువ మందికి బూస్టర్ షాట్ అందించే లక్ష్యంతో నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 40 ఏళ్లు అంతకుమించిన వయసు వారిలో కనీసం 80% మందికి బూస్టర్ షాట్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే దాదాపు 95,000 మందికి బూస్టర్ షాట్ ఇవ్వాల్సి ఉంటుంది. బూస్టర్ షాట్ పొందేందుకు అన్ని అర్హతలు ఉండి 40 ఏళ్లకు మించి వయసు వారు బహ్రెయిన్లో 2,50,000 మంది ఉన్నారు. ఇందులో 1,05,000 మంది ఇప్పటికే బూస్టర్ షాట్ తీసుకున్నారు. మిగిలిన వారిలో దాదాపు 95 వేల మందికి ఈ విడతలో బూస్టర్ డోస్ ఇవ్వాలన్నది నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ టార్గెట్. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచుతూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రొత్సహిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







