పీసీఆర్ సర్టిఫికెట్ల ఫోర్జరీ, అమ్మకం: నలుగురు బంగ్లాదేశీ వ్యక్తుల అరెస్ట్

- August 31, 2021 , by Maagulf
పీసీఆర్ సర్టిఫికెట్ల ఫోర్జరీ, అమ్మకం: నలుగురు బంగ్లాదేశీ వ్యక్తుల అరెస్ట్

రియాద్: ఓ మహిళ సహా మొత్తం నలుగురు బంగ్లాదేశీయుల్ని పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ల ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేశారు. సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి విక్రయిస్తున్నట్లుగా నిందితులపై అభియోగాలు  మోపబడ్డాయి. రియాద్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ క్రైడిస్ మాట్లాడుతూ, సెక్యూరిటీ అథారిటీస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రియాద్‌లోని ఓ రెసిడెన్షియల్ యూనిట్ కేంద్రంగా నిందితులు ఈ అక్రమ దందాకి తెరలేపారు. అమ్మకానికి సిద్ధంగా వున్న ఫోర్జరీ పీసీఆర్ సర్టిఫికెట్లు, వాటి తయారీకి వినియోగించిన సామాగ్రిని నిందతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com