నటుడు సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్
- September 11, 2021
హైదరాబాద్: నటుడు సాయి ధరమ్ తేజ్ హెల్త్ పై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడ్డాడని అందులో వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో తేజ్ కు చికిత్స అందిస్తున్నామని, ప్రధాన అవయవాలన్నీ బాగానే ఉన్నాయని, వాటి పని తీరు కూడా బాగుందని, ఈరోజు అవసరమైన మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. పరీక్షల అనంతరం రేపు తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరో అప్డేట్ ఇస్తామని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

ఇక సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు, మెగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. థమన్, మంచు మనోజ్ వంటి ప్రముఖురాలు సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అతివేగం కారణంగానే సాయి ధరమ్ తేజ్ కు ఈ ప్రమాదానికి గురయ్యాడు.
తాజా వార్తలు
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్







