ICC T20: స్కాట్లాండ్ పై టీం ఇండియా ఘన విజయం

- November 05, 2021 , by Maagulf
ICC T20: స్కాట్లాండ్ పై టీం ఇండియా ఘన విజయం

దుబాయ్: స్కాట్లాండ్‌ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. 6.3 ఓవర్లలో భారత్ స్కాట్లాండ్‌ జట్టు పెట్టిన 85 పరుగుల లక్ష్యాన్ని సునయాసంగా గెలుపొందింది. 6.3 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ ఇచ్చారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ 17.4 ఓవర్లలో 85 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీసి స్కాట్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించగా, బుమ్రా రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జార్జ్ మున్సీ చేసిన 24 పరుగులే అత్యధికం.మైఖేల్ లీస్క్ 21, కాలమ్ మాక్‌లియోడ్ 16, మార్క్ వాట్ 14 పరుగులు చేశారు. ఏడుగురు ఆటగాళ్లు కలిసి చేసింది ఆరు పరుగులు మాత్రమే. వీరిలో ముగ్గురు డకౌట్ కాగా, ఇద్దరు రెండేసి, మరో ఇద్దరు చెరో పరుగు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com