‘ఆచార్య’ మూడో పాటకు ముహుర్తం ఖరారు
- December 31, 2021
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై వోల్టేజ్ పార్టీ సాంగ్ అని హింట్ ఇస్తూ చిరు పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఇక ఈ సాంగ్ లో చిరు మాస్ స్టెప్స్ తో అలరించనున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఫిబ్రవరి 4 న రిలీజ్ అవుటున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మెగా కాంబో ఎంతటి విజయాన్ని రాబట్టుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి