అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు
- January 13, 2022
హైదరాబాద్: విదేశీ ప్రయాణికులు, అంతర్జాతీయ క్రెడిట్ కార్డు దారులే లక్ష్యంగా..మోసాలకు పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్ పై సైబరాబాద్ పోలీసులు దాడి చేశారు. బ్యాంకు వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించి కోట్ల రూపాయలు కాజేస్తున్న నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం తెలిపిన వివరాలు మేరకు..మొహాలీ, పంజాబ్ కి చెందిన ఏడుగురు సభ్యులున్న ముఠా, అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తు వినియోగదారులను మోసం చేస్తున్నారు.
విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డులే లక్ష్యంగా వీరు మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని, పూర్తి వివరాలు ఇస్తే వెంటనే యాక్టివేట్ చేస్తామని నమ్మబలుకుతారు. అనంతరం ఆ వివరాలతో ఆయా కార్డులను క్లోనింగ్ చేసి..ఆన్ లైన్ ద్వారా విదేశాల్లో ఆ కార్డులను విక్రయిస్తున్నారు. ముఠాకి చెందిన నవీన్ బొటాని కీలక సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు వీరు ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు తెలిపారు.
అడ్డుఅదుపులేకుండా సాగిన వీరి మోసాలకు విదేశీయులు భయపడిపోతున్నారని పోలీసులు పేర్కొన్నారు. విదేశీ క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఫ్రాంచైజ్గా ఉన్న పలు భారతీయ బ్యాంక్ లకు నవీన్ గ్యాంగ్ టోకరా వేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్ లో 80 మందితో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ ముఠాకు..దుబాయ్ లో ఉన్న మరో రెండు ముఠాలు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం కాల్ సెంటర్ పై జరిపిన దాడుల్లో రూ.1 కోటి 11 లక్షల నగదు ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి