యూఏఈ పై జరిగిన ఉగ్రదాడికి ఘాటైన సమాధానమిచ్చిన సౌదీ
- January 18, 2022
యూఏఈ: అబుధాబి పై జరిగిన ఉగ్రదాడి కి సమాధానంగా గడిచిన 24 గంటల్లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం సోమవారం యెమెన్ లోని హౌతీ ఉగ్రవాదులపై ప్రతిదాడి చేసింది. ఈ దాడుల్లో తొమ్మిది సైనిక వాహనాలు ధ్వంసమవ్వగా 80కి పైగా స్థావరాలు అంతమొందాయని అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ట్విట్టర్లో తెలిపింది.
"మేము గత 24 గంటల్లో మారిబ్లో మిలీషియా లక్ష్యంగా 17 దాడులు నిర్వహించాము" అని ట్వీట్లో పేర్కొంది.
ఇరాన్ మద్దతుతో యెమెన్ లోని హౌతీ మిలిటంట్లు యూఏఈ రాజధాని అబుధాబి లో డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందగా, ఆరుగురు గాయపడిన నేపథ్యంలో తాజా దాడులు జరిగాయి.
ఈ దాడులకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది యూఏఈ. "పిరికి" ఉగ్రవాద చర్యగా పేర్కొన్న ఈ చర్యకు "ప్రతిస్పందించే హక్కు" ఉందని నొక్కి చెప్పింది.
సనాలో వైమానిక దళం 24 గంటల వైమానిక కార్యకలాపాలను నిర్వహిస్తోందని మరియు ప్రజలు వారి భద్రత దృష్ట్యా హౌతీ మిలీషియా శిబిరాలకు దూరంగా ఉండాలని పౌరులకు పిలుపునిచ్చింది అరబ్ సంకీర్ణం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి