జి-20 సమావేశానికి ఒమన్‌ను ఆహ్వానించిన భార‌త్

- September 18, 2022 , by Maagulf
జి-20 సమావేశానికి ఒమన్‌ను ఆహ్వానించిన భార‌త్

మస్కట్: G-20 సమ్మిట్, సమావేశాలలో అతిథి దేశంగా ఒమ‌న్ పాల్గొన‌నుంది. ఈ మేర‌కు ఒమన్‌కు భారతదేశం ప్రత్యేక ఆహ్వానాన్ని అందించింది. న్యూఢిల్లీలో  2023 సెప్టెంబర్ 9, 10 తేదీలలో G-20 దేశాధినేతల సమ్మిట్ జ‌రుగ‌నుంది. ఇప్ప‌టికే బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యూఏఈ దేశాల‌ను భార‌త్ ప్ర‌త్యేకంగా ఆహ్వానించింది. ఈ సంద‌ర్భంగా సుల్తానేట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ అమిత్ నారంగ్ మాట్లాడుతూ.. జి-20 అధ్యక్షుడి హోదాలో ఉన్న భార‌త్‌.. అతిథి దేశంగా ఒమన్‌ను ఆహ్వానించడం రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక స్నేహానికి ప్ర‌తీక అన్నారు. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ GDPలో దాదాపు 85 శాతం వాటాను G-20 కూట‌మి క‌లిగి ఉంద‌న్నారు. ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రీమియర్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్‌లో పాల్గొనడానికి సుల్తానేట్‌కు ఇది ఒక మంచి అవకాశం అని నారంగ్ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com