ఒమన్‌లో ప్రజలను మోసగిస్తున్న ప్రవాసుల ముఠా అరెస్టు

- October 07, 2022 , by Maagulf
ఒమన్‌లో ప్రజలను మోసగిస్తున్న ప్రవాసుల ముఠా అరెస్టు

మస్కట్‌: విలాయత్‌ ఆఫ్‌ సీబ్‌లో నకిలీ ఫారాలు సృష్టించి ప్రజలను మోసగిస్తున్న ఏడుగురు సభ్యులు గల ప్రవాసుల ముఠాను అరెస్టు చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీసులు (ఆర్‌ఓపి) తెలిపారు. జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్, మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో సోషల్ మీడియా ద్వారా మోసం చేసిన ఆరోపణలపై సీబ్‌లోని విలాయత్‌లో ఏడుగురు వ్యక్తుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల బ్యాంకు సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో నకిలీ ఫారాలను నిందితులు తయారు చేశారని వివరించారు. అనుమానాస్పద కమ్యూనికేషన్‌లు, మెసేజ్‌లకు ప్రతిస్పందించవద్దని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు. అలాంటివి అనుమానస్పద విషయాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com