సీబ్‌లో 225 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం

- October 07, 2022 , by Maagulf
సీబ్‌లో 225 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం

మస్కట్: సీబ్‌లోని 211 కేఫ్‌లు, రెస్టారెంట్‌లలో మస్కట్ మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని 10 రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు మునిసిపాలిటీ తెలిపింది. దీంతోపాటు తినేందుకు పనికిరాని 225.6 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పబ్లిక్ హెల్త్ నిబంధనలను కేఫ్ లు, రెస్టారెంట్లు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఉపరితలాలను తరచుగా క్రిమిసంహారక చేయడం, సరైన వెంటిలేషన్‌ను కల్పించడం, ప్రతి కార్మికుడు/ఉద్యోగికి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించాలని సూచించింది. నిబంధనలు పాటించని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మస్కట్ మున్సిపాలిటీ హెచ్చరించింది. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఏదైనా నిబంధల ఉల్లంఘనలు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1111కి కాల్ చేసి చేప్పాలని కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com