అధిక లాభాల పేరుతో మహిళను Dh560,000 మోసం చేసిన వ్యక్తి
- November 18, 2022_1668775839.jpg)
యూఏఈ: అధిక లాభాల పేరుతో మహిళను ఓ వ్యక్తి Dh560,000 మేర మోసం చేశాడు. దీంతో బాధితురాలు అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టులో సదరు వ్యక్తిపై దావా వేసింది. ఆ వ్యక్తి తన నుండి మోసపూరితంగా తీసుకున్న Dh560,000 దిర్హామ్లను తిరిగి ఇప్పించాలని కోరింది. అలాగే తనకు జరిగిన నష్టానికి 100,000 దిర్హామ్లు పరిహారం చెల్లించాలని కోర్టును అభ్యర్థించింది. నిందితుడు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ద్వారా తనకు పరిచయం అయ్యాడని, లాభదాయకమైన వ్యాపారం గురించి తనకు తెలుసని చెప్పి తనను ఒప్పించాడని మహిళ తన దావాలో వివరించింది. తాను కూడా అదే వ్యాపారంలో పెట్టుబడి పెట్టానని ఆ వ్యక్తి చెప్పడంతో తాను అతడిని నమ్మానని ఆ మహిళ తెలిపింది. ఆ తర్వాత ఆమె Dh560,000 లను నిందితుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసినట్లు తెలిపింది. అనంతరం పెట్టుబడి పెట్టిన లాభాల కోసం నెలల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయిందని ఆ మహిళ వాపోయింది. ఆ వ్యక్తి తనను మోసం చేశాడని గ్రహించిన ఆమె.. నిందితుడిపై ఇంతకుముందు క్రిమినల్ ఫిర్యాదు చేశానని, అబుధాబి క్రిమినల్ కోర్ట్ మోసం చేసిన వ్యక్తిని దోషిగా నిర్ధారించిందని మహిళ తెలిపింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత సివిల్ కోర్టు న్యాయమూర్తి ప్రతివాది మహిళ నుండి మోసపూరితంగా తీసుకున్న Dh560,000 తిరిగి ఇవ్వాలని ఆ వ్యక్తిని ఆదేశిస్తూ తీర్పును ఇచ్చారు. క్రిమినల్ కోర్టు ఆ వ్యక్తికి ఇంతకుముందు Dh21,000 తాత్కాలిక పరిహారం ఇచ్చిందని స్పష్టం చేసిన న్యాయస్థానం ఫిర్యాది పరిహార దావాను తిరస్కరించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి