ఒమన్లో 347 ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు, 7092 రిజిస్ట్రేషన్లు
- December 20, 2022
మస్కట్: షిఫా దరఖాస్తుపై 7,092 మంది దాతలు (మరణం తర్వాత అవయవ దాతలు) నమోదు చేసుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్లో అవయవ మార్పిడి ఆపరేషన్ల సంఖ్య 347 కి చేరుకున్నాయని తెలిపింది. వాటిలో 306 ప్రత్యక్ష దాతలు, 19 మరణించిన దాతల నుండి పొందిన 325 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఉండగా.. ప్రత్యక్ష దాతల నుండి కాలేయ మార్పిడి సంఖ్య 22 గా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవయవ దానం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవయవ దానం కోసం జాతీయ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ గణంకాలను వెల్లడించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19న ఒమన్ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హెల్త్ మినిస్ట్రీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC







