జిలీబ్ అల్-షుయౌఖ్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు మృతి
- June 03, 2023
కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) ఒక ప్రకటనలో తెలిపింది. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశంలో సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదానికి కారణంగా తెలిపింది. అలాగే ప్రమాదం జరిగి సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఇంటిలోకి ప్రవేశించకుండా తలుపులు, ఇనుప కడ్డీలు వంటీ స్క్రాప్ లు ఉన్నాయని, దాంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇంటి యజమానులు తమ భవనాల భద్రతను నిర్ధారించుకోవాలని, అగ్నిమాపక సిబ్బందికి ఆటంకం కలిగించే స్క్రాప్లను నిల్వ చేయకుండా అద్దెదారులను నిరోధించాలని కువైట్ ఫైర్ ఫోర్స్ సూచించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







