ఇస్తాంబుల్లో చారిత్రాత్మక మ్యాచుని వీక్షించిన యూఏఈ అధ్యక్షుడు
- June 11, 2023
యూఏఈ: ఇస్తాంబుల్లో జరిగిన ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్ ఫైనల్లో మిలాన్ను 1-0తో మాంచెస్టర్ సిటీ ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 68వ నిమిషంలో రోడ్రీ చేసిన అద్భుతమైన గోల్తో మాంచెస్టర్ సిటీ చారిత్రాత్మక ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకుంది. యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సహా అనేక మంది ప్రముఖులు, ఉన్నత స్థాయి వ్యక్తులు ఇస్తాంబుల్లోని అటాటర్క్ ఒలింపిక్ స్టేడియంలో థ్రిల్లింగ్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. షేక్ మొహమ్మద్తో పాటు యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి, న్యాయశాఖ మంత్రి, మాంచెస్టర్ సిటీ యజమాని అయిన షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారు. షేక్ మన్సూర్ తర్వాత మాంచెస్టర్ సిటీ విజయంపై అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. ఆటగాళ్లతో సహా క్లబ్లోని ప్రతి ఒక్కరికి తన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







