టీటీడీ పాలకమండలి ప్రకటనపై అచ్చెన్నాయుడు విమర్శలు
- August 27, 2023
అమరావతి: ఏపీ ప్రభుత్వం 24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిని ప్రకటించగా, అందులో కొందరు వ్యక్తుల నియామకంపై విపక్షాలు భగ్గుమంటున్నారు. ఈ అంశంపై రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. వైఎస్ఆర్సిపి పాలనలో టీటీడీ పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఓ క్రైస్తవుడ్ని టీటీడీ చైర్మన్ చేశారని, శరత్ చంద్రారెడ్డి వంటి వ్యక్తిని టీటీడీ సభ్యుడిగా చేశారని విమర్శించారు.
ఇక, ఇసుక సత్యాగ్రహం పేరుతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు చేపడుతున్నట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు. సెప్టెంబరు 1 నుంచి నెలన్నర పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యాచరణ ఉంటుందని వివరించారు. కోటి ఇళ్లకు వెళ్లేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజలకు వివరించాలని టిడిపి శ్రేణులకు అచ్చెన్న పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







