ఇరాన్-సిరియాలో అమెరికా ప్రతీకార దాడులు-18 మంది మృతి
- February 03, 2024
అమెరికా: ఇటీవల జోర్డాన్ లో తమ క్యాంప్పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా ప్రతిదాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. దీంతో సిరియాలో 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు.
మిలిటెంట్లకు చెందిన కమాండ్ కంట్రోల్ ప్రధాన కేంద్రంతోపాటు ఇంటెలిజెన్స్ కేంద్రాలు, రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఆయుధ సామాగ్రి నిల్వల గోడౌన్లు, లాజిస్టిక్స్ సౌకర్యాలపై దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆదివారం జోర్డాన్లో ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు. జోర్డాన్లోని అమెరికా సైనిక క్యాంప్పై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







