ఒమన్‌లో కాల్పులు..నలుగురు మృతి

- July 16, 2024 , by Maagulf
ఒమన్‌లో కాల్పులు..నలుగురు మృతి

మస్కట్: ఒమన్‌లోని వాడి అల్ కబీర్‌లోని మసీదు సమీపంలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. అధికారులు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. తూర్పు మస్కట్‌లోని మసీదు పరిసరాల్లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.  "వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు పరిసరాల్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు." అని ఓమానీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.  కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని, గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com