డ్రగ్స్ కేసులో 30 మంది ప్రముఖులు

- July 31, 2024 , by Maagulf
డ్రగ్స్ కేసులో 30 మంది ప్రముఖులు

హైదరాబాద్: ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కేసు కీలక మలుపు తిరిగింది. డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇటీవల దొరికిన అమన్ విచారణలో హైదరాబాద్ సిటీ లోని వీఐపీల డ్రగ్స్ బాగోతం బయట పడింది.రకుల్ సోదరుడు అమన్ విచారణలో హైదరాబాద్ సిటీ కేంద్రంగా వివిధ కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న ప్రముఖులు ఉన్నట్లు బయటకు వచ్చింది.ఈ క్రమంలోనే వాళ్లందరికీ పోలీసులు డ్రగ్స్ వినియోగంపై నోటీసులు ఇవ్వటానికి రెడీ అవుతున్నారు.ఈ కేసు విచారణలో మరో 30 మంది వీఐపీలు డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించామని ఆయన్ను పట్టుకున్నప్పుడే 19 మంది వీఐపీలను గుర్తించి నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com